గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థనే దుర్వినియోగం అవుతుంది : సీఎం కేసీఆర్

-

బీజేపీ పాల‌న‌లో గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌నే దుర్వినియోగం అవుతుంద‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. గ‌తంలో ఇలాంటి ప‌రిస్థితులు లేవ‌ని అన్నారు. కానీ బీజేపీ నుంచి వ‌చ్చిన త‌ర్వాతే.. బీజేపీ యేత‌ర పార్టీలు పాల‌నలో ఉన్న రాష్ట్రాల్లో ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని అన్నారు. దీని పై త‌మిళ‌నాడు ముఖ్య మంత్రి ఏంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌ల‌ను తాను చూశాన‌ని అన్నారు.

కాగ ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ – సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ వివాదం విషయం పై కేసీఆర్ స్పంద‌నను జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శ్నించ‌గా సీఎం కేసీఆర్ స‌మాధానం ఇచ్చారు. కాగ బెంగాల్ ముఖ్య మంత్రి మ‌మ‌తా.. బెన‌ర్జీ బీజేపీ యేత‌ర ముఖ్య‌మంత్రులతో స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించార‌ని నిర్ణ‌యించారు. అందులో భాగంగా త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య మంత్రికి స‌మాచారం ఇచ్చారు. కాగ ఈ స‌మాచారం త‌న‌కు వ‌ర‌కు రాలేద‌ని.. వ‌స్తే త‌ప్ప‌కుండా ఆలోచిస్తాన‌ని సీఎం కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news