రాత్రికి రాత్రి కలగన్నారా?.. హనుమంతుడి జయంతిపై సంచలన విమర్శలు

-

తిరుపతి: హనుమంతుడి జన్మస్థలంపై కొద్దికాలంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. హనుమంతుడు తిరుమలలోని అంజనాద్రిలోనే జన్మించారని టీటీడీ అంటోంది. ఇవాళ హనుమంతుడి జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. దీంతో గోవింద ఆనంద సరస్వతి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ హనుమంతుడి జయంతి వ్యవహారం హాస్య దారవహికంలా ఉందన్నారు. హనుమంతుడిపై టీటీడీ ప్రచురించిన పుస్తకంలో ఇచ్చిన జయంతికి, ఇప్పుడు నిర్వహిస్తున్న తేదీలకు పొంతన లేదని విమర్శించారు. టీటీడీ చెప్పినట్టు శ్రావణ మాసం అంటే జులై‌లో జరగాలని తెలిపారు. ఇదేనా టీటీడీ పండితులు, వీసీ‌లు హనుమంతుడికి బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేదని వ్యాఖ్యానించారు. హనుమంతుడి జన్మపై తెలుగులో ఎందుకు బుక్ ప్రింట్ చేస్తారు? ఇంగ్లీష్‌లో చేస్తే టీటీడీ గుట్టు అందరికి తెలిసిపోతుందనా అని గోవింద ఆనంద సరస్వతి స్వామి ప్రశ్నించారు.

రాత్రికి రాత్రి కలగన్నారా?.. టీటీడీ అహంకారాన్ని వదలాలని గోవింద ఆనంద సరస్వతి స్వామి సూచించారు. ‘‘తప్పును ఒప్పుకుంటే పరువు పోతుంది అని తప్పులపై తప్పులు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా చైత్ర మాసంలో అంటే మార్చిలో చేస్తారు. టీటీడీ సత్యాన్ని చెప్పకుండా, తప్పుదారి పట్టిస్తోంది. అబద్ధాలపై అబద్దాలు చెపుతున్నారు. జపాలి తీర్థంలో హనుమంతుడు పుట్టాడు అన్నారు. ఇప్పుడు ఆకాశగంగా అంటున్నారు. ఇలా క్షణానికి ఒక మాట టీటీడీ చెప్పటం తగదు. ఇప్పటికి శంకర, మద్వ, రామానుజ పెద్దలను టీటీడీ వెంటనే సంప్రదించాలి. వీళ్ళ డబ్బులు ఉందని నేను అంగీకరించినట్టు ప్రచారం చేశారు. విశాఖ శారదా పీఠం డూప్లికేట్ పీఠం. శంకరాచార్యులు పెట్టిన శృంగేరి, బద్రి, పూరి, ద్వారక ఈ నాలుగుపీఠాలు, కంచి పీఠం మాత్రమే శంకర పీఠాలు. ఉత్తర భారతంలో ఇలాంటి డూప్లికేట్ మాటలు చెపితే వదలరు. తరుముకుంటారు. సీఎం మద్దతు ఉంటే శంకర్ పీఠం అవుతుందా?. జగన్ లాంటి వ్యక్తిని మారు వేషంలో తీసుకు వస్తే సీఎం పోస్ట్ ఇచ్చేస్తారా?. సన్యాసులు రాజనీతిలో రాకూడదు.’’ అని గోవింద ఆనంద సరస్వతి స్వామి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news