ఏపీలో మద్యం కుంభకోణం పై సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ అసెంబ్లీలో మద్యం పాలసీ పై శ్వేత పత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో సీఎం చంద్రబాబు ఓ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మద్యం, అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామని సభాముఖంగా ప్రకటించారు. లోతైన విచారణ తరువాత.. అవసరం అయితే ఈ అంశాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కి సిఫారస్ చేస్తామని వెల్లడించారు చంద్రబాబు.

గత ప్రభుత్వ హయాంలో తీవ్ర స్థాయిలో మద్యం అక్రమాలు చోటు చేసుకున్నాయని.. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేసారు. మద్యం విక్రయాలలో అక్రమ సంపాదన పై వైసీపీ నేతల జేబుల లోకి వెళ్లిందని ఆరోపించారు. వీటన్నింటినీ బయటికీ లాగేందుకు సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామని వివరించారు. తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షిస్తేనే మళ్లీ తప్పు జరుగకుండా ఉంటుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news