“లైగర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహుర్తం ఫిక్స్

-

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రూపొందుతోంది. పూరి జగన్నాథ్, నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది.

పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.అయితే ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్, అక్డి పక్డి సాంగ్, అఫట్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా.. లైగర్‌ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు ముహుర్తం ఖరారు అయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఎల్లుండే అంటే.. ఆగస్ట్‌ 20 వ తేదీన గుంటూరులో జరుగనుంది. సాయంత్రం 5 గంటలకు ఈ ఈవెంట్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ సినిమా ఆగస్ట్ 25వ తేదీన రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news