జేపీ నడ్డాకి సమాధి…బిజెపి సీరియస్

-

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి రోజుకో షాక్‌ తగులుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గుర్తుతెలియని వ్యక్తులు సమాధి నిర్మించారు.

2016లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో జేపీ నడ్డా దండుమల్కాపురంలో పర్యటించిన సమయంలో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆరేళ్లు దాటిన ఇప్పటికీ ఆ హామీ నెరవేరకపోవడంతో ఆ స్థలంలో జేపీ నడ్డాకు సమాధి కట్టారు. అయితే ఇది టీఆర్ఎస్ పని అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బతికి ఉన్న వారికి సమాధి కట్టే దుస్సంప్రదాయానికి టిఆర్ఎస్ తెర తీసింది అన్నారు. నడ్డా ఇక్కడ పోటీ చేసి గెలిచారా? ఆయన మీద ఈ అక్కసు ఎందుకని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news