నిరుద్యోగులకు శుభవార్త..ఉగాది తర్వాత గ్రూప్‌-1 నోటిఫికేషన్

-

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త ను తెచ్చింది. ఉగాది పర్వదినం తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 503 పోస్టుల భర్తీకి ఇప్పటికే కెసిఆర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా అందుకు సంబంధించిన పూర్తి వివరాలను వారం రోజుల్లో ఇవ్వాలని ఆయా శాఖల అధికారులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోరింది.

వివరాలు అన్నీ అందాక ప్రకటన వెలువరించింది టిఎస్పిఎస్సి. అటు కొత్త విధానానికి అనుగుణంగా అభ్యర్థుల స్థానికత ఖరారు కోసం ఓ టి ఆర్ లో సవరణలకు ఒకటి, రెండు రోజుల్లో ఆన్ లైన్ ద్వారా టిఎస్పిఎస్సి అవకాశం కల్పిస్తుంది.

ఇక వివిధ శాఖల్లో 30 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా అందులో 503 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం… అభ్యర్థులకు కొత్త స్థానికత వర్తించనుంది. పోస్టుల నోటిఫికేషన్‌ రానుండగా.. నిరుద్యోగులు అలర్ట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news