ఏపీ రైతులకు సీఎం జగన్ శుభవార్త..ఆ పత్రాలు నేడు అందజేత

-

ఏపీ రైతులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇవాళ సీఎం వైయస్‌ జగన్‌ ఎన్టీఆర్‌ జిల్లా అవనిగడ్డ పర్యటించనున్నారు. 22 ఏ (1) కింద ఉన్న నిషేదిత భూముల సమస్యకు పరిష్కారం కల్పించనున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతులకు క్లియరెన్స్‌ పత్రాలు అందజేయనున్నారు.

ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. 10.55 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. ఇక 10.55 – 12.25 గంటల మధ్య బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం ఉండనుంది.

 

అనంతరం నిషేదిత భూముల జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్‌ పత్రాలు రైతులకు అందజేయనున్న సీఎం…మధ్యాహ్నం 1.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news