15ఏళ్ల కుర్రాడు..15 రౌండ్ల కాల్పులు..ముగ్గురు మృతి…!

-

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఓ స్కూల్లో కి అకస్మాత్తుగా వచ్చిన దుండగుడు విద్యార్థులపై కాల్పులు జరిపాడు. దాంతో ముగ్గురు విద్యార్థులు మరణించారు. మరణించిన వారిలో 16 ఏళ్ల బాలుడు మరియు 14,17 ఏళ్ల ఇద్దరు బాలికలు ఉన్నారు. ఈ ఘటనలో మరో 8మంది ఘయపడినట్టు తెలుస్తోంది.

airgun and pellet

మిచిగాన్ రాష్ట్రంలో డెట్రాయిట్ కు 48 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆక్స్ ఫర్డ్ లో ఉన్న పాఠశాలలో మధ్యానం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఓ టీచర్ కూడా ఉన్నట్టు సమాచారం. ఇక ఈ ఘటన పై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అనుమానితుడు అయిన 15 ఏళ్ల కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా నిందితుడి వద్ద నుండి సెమీ ఆటోమేటిక్ హ్యాండ్ గన్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా దుండగుడు 20 రౌండ్ల వరకూ కాల్పులు జరిపి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news