ఏపీ రాజకీయ పరిస్థితులపై హరీశ్‌ రావు పరోక్ష వ్యాఖ్యలు

-

ఏపీ రాజకీయ పరిస్థితులపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు పనితనం తప్ప పగతనం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఎప్పుడో జైలులో వేసేవారని అన్నారు. ఓటుకు నోటు కేసులో చర్యలు తీసుకుని ఉండేవారని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో చూస్తున్నాం కదా… వాళ్లు గెలవగానే వీళ్లను జైలుకు పంపిస్తారు… వీళ్లు గెలవగానే వాళ్లను జైలుకు పంపిస్తారు అని హరీశ్ రావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గతంలో రేవంత్ సోనియాను బలి దేవత అన్నాడని, ఇప్పుడు దేవత అంటున్నాడని విమర్శించారు. రేవంత్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం అని అన్నారు. తనది బీజేపీపై పోరాడే డీఎన్ఏ అంటున్న రాహుల్ గాంధీ… రేవంత్ రెడ్డి డీఎన్ఏ ఏమిటో తెలుసుకోవాలని హరీశ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డీఎన్ఏలు సరిపోలడం లేదని ఎద్దేవా చేశారు.

BJP has caught fear of KCR; Harish Rao | INDToday

అంతేకాకుండా.. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికి ఒకటి కాదు అని, నీళ్లు, నూనె ఎప్పుడైనా కలుస్తాయా ఇది కూడా అంతే కేసీఆర్‌కు పనితనం తప్ప పగతనం లేదు అన్నారు. కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేయకపోవునా..? పక్క రాష్టాల్లో చూస్తున్నాం వాళ్ళు గెలవగానే వీళ్ళను జైలుకు పంపిస్తారు. వీళ్ళు గెలవగానే వాళ్ళని జైలుకి పంపిస్తారు అన్నారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తోనే నారాయణఖేడ్ అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ బీజేపీ మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం ప్రతి ఇంటికి చేరింది, మాయ మాటలు నమ్మి మోసపోవద్దని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news