నిర్మల సీతారామన్ హైదరాబాద్ కి వచ్చి తెలంగాణ పై విషంకక్కే ప్రయత్నం చేశారు – హరీష్ రావు

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్ కు వచ్చి తెలంగాణ పై విషంకక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఆమె అడ్డగోలుగా మాట్లాడారని, ఆమె మాటల్లో నిజాయితీ లేదు, నిజం లేదన్నారు. సీఎం కేసీఆర్ మొన్న అసెంబ్లీ లో మాట్లాడింది నూటికి నూరు శాతం నిజం అన్నారు హరీష్ రావు. లెక్కలతో సహా సీఎం కేసీఆర్ మాట్లాడారని తెలిపారు.

రాష్ట్రానికి వచ్చి ఏమైనా మంచి మాటలు మాట్లాడుతాదేమో అంటే అవ్వే జూట మాటలు తప్ప కొత్తగా ఎం లేదన్నారు. దేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను శాసన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారని అన్నారు. ఆర్బీఐ, నీతి ఆయోగ్, కాగ్ లెక్కల ఆధారంగా సీఎం కేసీఆర్ చెప్పారని వివరించారు. వాస్తవాలను కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్టు కొడితే కేంద్ర మంత్రులకు కడుపు మంట అవుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news