పోచారం లక్ష్మీపుత్రుడు…మాకు మార్గదర్శి : మంత్రి హరీష్‌ రావు

-

తెలంగాణ వైద్య శాఖ మంత్రి హారీష్ రావు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పోచారంను అంకుల్ అంటూ సంబోదిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన మంత్రి హారీష్ రావు……పోచారం లక్ష్మీపుత్రుడు అని కొనియాడారు. పోచారం మాకు మార్గదర్శి… రాజకీయంగా సుదీర్ఘ అనుభం ఉన్న నేత అని తెలిపారు. నియోజకవర్గ అభివ్రుద్దిపై దూరద్రుష్టి ఉన్న నేత పోచారందని.. డబుల్ బెడ్ రూంల నిర్మాణంలో పోచారం ముందు వరసలో ఉన్నారని వెల్లడించారు.

డబుల్ బెడ్ రూంల నిర్మాణంపై విమర్శలు చేసే పార్టీలు బాన్సువాడ నియోజకవర్గాన్ని చూడాలని… కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యమేనా అని మాట్లాడిన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏం సమాదానం చెప్తారని పేర్కొన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణంపై అవినీతి ఆరోపణలు చేసి విపక్షాలు బంగపడ్డాయి…..ఇంత పెద్ద ప్రాజెక్టు దేశంలో ఎక్కడా లేదు… నిర్మించలేదు… ఇది ముఖ్యమంత్రి చిత్తశుద్దికి నిదర్శనమని వివరించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ హాయాంలో నిజాంసాగర్ ఎండిపోయింది నిజంకాదా….రైతులకు సాగు, ప్రజలకు తాగునీరు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ దేనని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్, వ్రుద్దాప్య పెన్షన్ లను సమర్దవంతంగా అమలుచేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని… అవరసం ఉన్నా లేకున్నా సిజేరీయన్ లు చేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news