కోహినూర్‌ కోసం రిషి సునాక్ కిడ్నాప్.. హర్ష్ గోయెంకా క్రేజీ ప్లాన్

-

బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ నియమితుడైనప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వీటిలో ఇంట్రెస్టింగ్ గా ఉన్న పోస్ట్ ఏంటంటే.. టీమ్ ఇండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రాకు, రిషి సునాక్ కు మధ్య ఉన్న పోలికలను ఉదహరిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరికొందరేమో ఇప్పటికైనా మన కోహినూర్ తిరిగి ఇచ్చేయాలని పోస్టులు పెడుతున్నారు.

తాజాగా ఈ విషయంపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా కూడా స్పందించారు. కోహినూర్‌ను తిరిగి భారత్‌కు తీసుకువచ్చేందుకు తన స్నేహితుడు ఒక ప్లాన్ చెప్పాడంటూ ఆయన ఒక ప్లాన్ ని ట్విటర్ లో షేర్ చేశారు.

‘కోహినూర్‌ను వెనక్కు తెచ్చేందుకు నా స్నేహితుడి ఐడియా.. రిషి సునాక్‌ను భారత్‌కు ఆహ్వానించాలి. తన అత్తమామలను కలిసేందుకు ఆయన బెంగళూరు ట్రాఫిక్‌లో ఉండగా కిడ్నాప్ చేసేయాలి. ఆ తర్వాత రిషి స్థానంలో ఆశిష్ నెహ్రాను ఆ దేశం పంపించాలి. అలా చేసినా ఎవరూ గుర్తు పట్టలేరు. చివరగా కోహినూర్‌ను భారత్‌కు తిరిగిచ్చే బిల్లును పాస్ చేయించాలని నెహ్రాకు చెప్తాం’. ఇదీ హర్ష్ గోయెంకా స్నేహితుడు చెప్పిన ప్లాన్. ఇది చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు. క్రేజీ ప్లాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news