వికారాబాద్ టిఆర్ఎస్ లో వేడెక్కిన రాజకీయాలు.. జడ్పీ చైర్ పర్సన్ సునీత వాహనంపై దాడి

-

వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కారుపై దాడి జరిగింది. దీంతో వికారాబాద్ టీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు వేడెక్కాయి.జిల్లా పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే పై తీవ్ర ఆరోపణలు చేసారు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి.ఎమ్మెల్యే కావాలనే తన కారుపై దాడి చేయించి…తన వర్గంతో అడ్డుకున్నాడని అన్నారు.జిల్లా పార్టీ అధ్యక్షుడైన ఆనంద్ అందరిని కలుపుకొని పోకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నాదని ఆరోపించారు.

తన నియోజకవర్గంలో ఉద్యమ సమయంలో పార్టీ కోసం పనిచేసిన ఉద్యమ కారులకు నామినేటేడ్ పదవులు ఇవ్వకుండా అన చెప్పుచేతల్లో ఉండే రియలెస్టేట్ వ్యాపారులకు, డాక్టర్లకు పదవులు కట్టబెడుతున్నాడని అన్నారు.గతంలో తన పేరు పక్కన తాను చదివిన డిగ్రీలు లేవని శీలాఫలకాలను పగులగొట్టిన ఘణత ఆనంద్ కి ఉందన్నారు.ప్రతి చిన్న విషయాన్ని సీఎం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లోదనే ఇన్నాళ్లు చెప్పలేదన్నారు.ఇప్పుడు అన్ని విషయాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు.త్వరలోనే ఆనంద్ ను జిల్లా పార్టీ పదవి నుంచి తప్పిస్తారని చెప్పారు సునీతా మహేందర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news