కడపలో రూ. కోటి సీజ్.. ఈ డబ్బులు ఎవరివి.!

-

ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికక్కడ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతూ అన్ని విషయాల పై నిఘా ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్రమ మద్యం తరలింపు కూడా ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు అక్రమంగా పోలీసులు తనిఖీల్లో ఎక్కువగా అక్రమంగా తరలిస్తున్న డబ్బులు బయట పడుతున్నాయి. ఇలాంటి ఘటనలు కాస్త సంచలనంగా మారిపోతున్నాయి. ఇక ఇటీవల మరోసారి భారీగా డబ్బులు పట్టుబడడం కలకలం సృష్టిస్తోంది.

కడప జిల్లా గోపవరం పిపి కుంట లో ఇటీవలే భారీగా డబ్బులు బయటపడడం కలకలం సృష్టించింది. చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు ఈ క్రమంలోనే కర్ణాటక నుండి నెల్లూరుకు వాహనం వచ్చింది. అయితే వాహనంలో ఉన్న వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఈ క్రమంలోనే ఏకంగా కార్లో నోట్లకట్టలు బయటపడ్డాయి దాదాపు 1.05 కోట్ల వరకు నగదు బయటపడగా అయితే దీనికి సంబంధించిన ఎలాంటి రసీదులు లేకపోవడంతో పోలీసులు ఈ నగదు మొత్తాన్ని సీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news