BREAKING: ఆర్మీ హెలికాప్టర్ క్రాష్… మృత్యువు తో పోరాడుతూ కెప్టెన్ వరణ్ సింగ్ మృతి..

-

తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో మిగిలిన ఒక్కరు కూడా మరణించారు. మృత్యువుతోొ పోరాడుతూ.. కెప్టెన్ వరణ్ సింగ్ బెంగళూర్ లో ఈరోజు మరణించాడు. గత బుధవారం డిసెంబర్8న తమిళనాడు నీలగిరి జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో దేశ తొలి సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ తో పాటు 11 మంది మరణించారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచనం కలిగించింది. యావత్ దేశాన్ని దు:ఖసంద్రంలో ముంచింది. అయితే ఆ విషాదకర ఘటన నుంచి కెప్టెన్ వరణ్ సింగ్ ఒక్కరు మాత్రమే తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన కూడా అమరుడయ్యారు.

హెలికాప్టర్ ప్రమాదం తరువాత వెల్లింగ్టన్ లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరణ్ సింగ్ ను మెరుగైన వైద్యం కోసం బెంగళూర్ కు తరలించారు. ఆయనను బతికించేందుకు వైద్యులు చాలా పోరాటం చేశారు. అయినా ఆయన ప్రాణాలను దక్కించ లేక పోయారు. ఆయన బ్రతికి రావాలంటూ యావత్ దేశం ప్రార్థనలు చేసింది. ప్రధాని మోదీ నుంచి సాధారణ ప్రజలు వరకు ఆయన కోలుకోవాలని ఆకాంక్షించారు.  కెప్టెన్ వరణ్ సింగ్ మరణంతో హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న మొత్తం 14 మంది మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news