డ్రగ్స్‌ కేసులో నేను..వారిని చెప్పుతో కొట్టాలి : నటి హేమ

-

హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసు వ్యవహారంపై టాలీవుడ్‌ సీనియర్‌ నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి పబ్ లో తాను లేనని…ఆమె వివరించారు. డ్రగ్స్ కేసులో 150 మంది దొరికితే అందులో సినిమా వాళ్ళు ఒకరిద్దరే.. వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకున్నారు అనే ఆధారాలు లేవని ఆమె స్పష్టం చేశారు నటి హేమ.

మొత్తం సినిమా ఇండస్ట్రీ ని తప్పు పట్టకండని కోరారు. డ్రగ్స్ ఎవరు తీసుకున్నా తప్పే… చెప్పుతో కొట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు. అంతేకాదు.. తన పేరు ఉందని ప్రచారం చేసే వారిపై కేసులు పెడతానని హెచ్చరించారు. అసలు నిజా, నిజాలు తెలియక.. చాలా ఛానెల్స్‌ తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నటి హేమ. కాగా.. ఈ కేసు లో టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు మెగా డాటర్‌ నిహారిక, నిర్వాహకులు అభిషేక్‌ ఉప్పల్‌, అనిల్‌ కుమార్‌ లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news