ఇకపై కారులో అన్నీ సీట్లకు సీట్‌ బెల్ట్‌ అలారం.. కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం..

-

బైక్‌పై వెళ్తుంటే హెల్మంట్‌, కారులో వెళ్తుంటే సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవడం కంపల్సరీ చేయాలి. కానీ చాలామంది సీట్‌ బెల్ట్‌ను పెట్టుకోవడానికి ఇష్టపడరు. సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకపోతే..చాలా కార్లలో అలారం మోగుతుంది. ఈ సిస్టమ్‌ ఇప్పటివరకూ కొన్ని కార్లకే ఉంది. వెనుక సీట్ బెల్ట్ అలారం సిస్టమ్‌తో కొన్ని లగ్జరీ కార్లకు మాత్రమే అమర్చబడి ఉంటాయి. అయితే ఇప్పుడు కార్ల కంపెనీలు వాహనంలోని అన్ని సీట్లలో సీట్ బెల్ట్ అలారంలను తప్పనిసరిగా అమర్చాలని ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను జారీ చేసింది.

ఓవర్ స్పీడింగ్ కోసం స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కోసం మాన్యువల్ ఓవర్‌రైడ్ సిస్టమ్‌ను కూడా కారులో ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుందట. ప్రమాదం జరిగితే ఎలక్ట్రిక్‌ సిస్టమ్‌ ఫెయిల్‌ కావడంతో ప్రయాణికులు కారులోనే చిక్కుకుపోయిన ఘటనలు ఉన్నాయి.. మాన్యువల్ ఓవర్‌రైడ్ సిస్టమ్‌తో అటువంటి పరిస్థితిలో వాహనం డోర్‌ తెరుచుకుంటుంది.

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ముసాయిదా నియంత్రణపై ఈ అంశాలపై మీరు సలహాలు తెలుపవచ్చు. మీరు ఈ వ్యాఖ్యలను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 5వరకూ ఉంది.. రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్రీ మృతి చెందడంతో వెనుక సీటుకు సంబంధించిన నిబంధనలన్నీ ఇటీవలే తీసుకువస్తున్నారు..

దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారని నివేదిక పేర్కొంది. భారతదేశంలో వాహనాల సంఖ్య ప్రపంచంలో 1 శాతం మాత్రమే ఉండగా, రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య పరంగా పది రెట్లు పెరిగి 10 శాతానికి చేరుకున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అందుకే కార్లలో సీటు బెల్ట్ అలారం తప్పనిసరి కాకుండా సీటు బెల్టు పెట్టుకునే నిబంధనలను కఠినతరం చేయాలని కార్ల కంపెనీలు చెబుతున్నాయి. మోటారు వాహనాల చట్టం ప్రకారం.. సీటు బెల్టు పెట్టుకోకుంటే వెయ్యి రూపాయల జరిమానా విధించే నిబంధన ఉంది. ఇలా జరిమానాలు విధించినా చాలా మంది నిర్లక్ష్యం చేయడం దురదృష్టం.

Read more RELATED
Recommended to you

Latest news