చిత్తూరు జిల్లాలో హై టెన్షన్.. ఎక్కడిక్కడ నేతల అరెస్ట్ !

-

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చిత్తూరు పర్యటన మీద ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే చిత్తూరులో చంద్రబాబు దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. తిరుపతిలో ధర్నాకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కోవిడ్ నిబంధనలు పాటించాలని పోలీసులు చెబుతున్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో 144 సెక్షన్ అని కూడా చెబుతున్నారు.

అయితే చంద్రబాబు పర్యటనకు అనుమతించాలని కొన్నిచోట్ల టీడీపీ నేతల నిరసనలు చేయగా వారిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు అమర్నాథ్ రెడ్డి అలాగే పులివర్తి నానిని కూడా అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో టీడీపీ నేత నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పోలీసులు నిర్బంధించారు. దీంతో పాటు తెదేపా నేతల ఇళ్ల వద్ద నోటీసులు అంటించారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news