మేడ్చల్ లో తీవ్ర ఉద్రికత.. భారీ ఎత్తున పోలీసుల మోహరింపు !

-

రంగారెడ్డి జిల్లా మేడ్చల్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మేడ్చల్ లోని ఉప్పరపల్లిలో ప్రహరీ గోడ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సత్తిరెడ్డి, వీరాస్వామి అనే ఇరువురి మధ్య ఈ గొడవ జరిగినట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగా సత్తి రెడ్డి అనే వ్యక్తి మీద రౌడీ మూకలు దాడి చేశాయని చెబుతున్నారు. వీర స్వామి రౌడీలతో దాడి చేయించాడని సత్తిరెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

police
police

భువనగిరికి చెందిన రౌడీ గ్యాంగ్ గంజాయి సేవించి వచ్చి దాడి చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం సత్తి రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇరు వర్గాల మధ్య దాడుల నేపథ్యంలో ఉప్పరపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఏ క్షణం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగుతుందో అని గ్రామస్తులు భయం భయంగా గడుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news