‘సారీ అమ్మానాన్న.. అతణ్ని ప్రేమించా..’.. యువకుడి సూసైడ్ లెటర్

-

ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని.. అతణ్ని విడిచి ఉండలేక పోతున్నానని సూసైడ్ నోట్ రాసి 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్​లోని కోటాలో జరిగింది.

మధ్యప్రదేశ్​ ఛింద్వారాకు చెందిన ప్రథమ్​ జైన్​.. రాజస్థాన్​లోని కోటాలోని ఓ హాస్టల్​లో ఉంటూ ఐఐటీ శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే భవ్య అనే యువకుడిని ప్రేమించాడు. అతడి ప్రేమ విఫలం కావడం వల్ల సూసైడ్​నోట్​ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చదువు కోసం చాలా ఖర్చు పెట్టారని.. తనను క్షమించాలని కోరుతూ తల్లిదండ్రులకు లేఖ రాశాడు.

“సారీ అమ్మ, నాన్న​. నేను జీవించడానికి అర్హుడిని కాను. నేను చాలా ప్రయత్నించాను. కానీ నా వల్ల కావట్లేదు. మీ డబ్బును వృథా చేసినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మీరు తమ్ముడి చదవు కోసం ఖర్చు పెడితే చాలు. నా ప్రేమ నిజమైనది. కానీ అది ఓ అబ్బాయితో జరిగింది. నేను భవ్యను ఎంతో ప్రేమిస్తున్నాను.”  – లేఖలో ప్రథమ్​ జైన్​

పోలీసుల కథనం ప్రకారం.. ప్రథమ్​ జైన్​ రెండు నెలల కింద ఐఐటీ కోచింగ్​ కోసం కోటా వచ్చాడు. ఉదయం బ్రేక్​ఫాస్ట్​ చేసిన తర్వాత స్నేహితులు కోచింగ్​కు వెళ్లగా అతడు మాత్రం​ గదిలోనే ఉన్నాడు. మధ్యాహ్నం సమయంలో తలుపు తట్టినా తెరవలేదు. నిద్రపోతున్నాడని భావించిన స్నేహితులు.. సాయంత్రం మళ్లీ వచ్చి పిలిచారు. అనుమానం వచ్చిన స్నేహితులు, హాస్టల్​ సిబ్బంది.. తలుపులు తెరిచి చూడగా.. ఉరివేసుకుని కనిపించాడు.

సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వైద్య పరీక్షల​ అనంతరం మృతదేహాన్ని వారికి అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news