భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య!

-

రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలంలో భార్య కాపురానికి రావడం లేదంటూ తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

మండలంలో ఆవునూరు గ్రామానికి చెందిన వంగ దేవి రెడ్డి (27) అనే రైతు నాలుగు సంవత్సరాల క్రితం గూడెం గ్రామానికి చెందిన సింధుజాను వివాహం చేసుకున్నాడు. అన్యోన్యమైన దాంపత్య జీవితంలో గత రెండు సంవత్సరాలుగా చిన్న చిన్న గొడవలతో వీరిద్దరికీ మనస్పర్ధలు ఏర్పడి, సింధుజ తల్లి గారి ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురైన దేవి రెడ్డి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, అతని తండ్రి రాజిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news