నిమజ్జనం ఎఫెక్ట్.. హుస్సేన్‌సాగర్‌లో మరింత పెరిగిన కాలుష్యం

-

కాలుష్య కోరల్లో హుస్సేన్ సాగర్ కొట్టుమిట్టాడుతోంది. గణేశ్ నిమజ్జనాలతో సాగర్ మరింత కాలుష్యమైంది. దాదాపుగా ఈ ఏడాది 2 లక్షల విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసినట్లు అధికారులు అంచనా వేశారు. నీటి నాణ్యత లెక్కగట్టేందుకు కాలుష్య నియంత్రణ మండలి వేర్వేరు రోజుల్లో నమూనాలు సేకరించింది.

ఇందులో బయో ఆక్సిజన్‌ డిమాండ్‌ మూడు లోపు ఉండాలి. కానీ, 30కిపైగా ఉందని ప్రాథమిక పరిశీలనలో తేలింది. కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ నాలుగుకి బదులు… 25రెట్లు ఎక్కువగా ఉందని గుర్తించారు. ఎన్​టీఆర్​ గార్డెన్‌ ఎదురుగా రెండుచోట్ల, లుంబినీ పార్క్‌, నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్‌ సహా బుద్ధ విగ్రహం వద్ద ఆరుచోట్ల నీటి నమూనాలు తీసుకున్నారు.

నిమజ్జనానికి ముందు… ఆ తర్వాత రోజుల్లోనూ సేకరించారు. శనివారం కూడా నిమజ్జనం కొనసాగడంతో ఆదివారం నమూనాలు తీసుకున్నారు. అప్పటికీ భారీ విగ్రహాలు పూర్తిగా నిమజ్జనం కాకపోవడంతో కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వినాయక నిమజ్జనం జరిగిన మూడ్రోజులు భారీ వర్షాలు కురవడంతో వరదనీటి కాల్వలు, నాలాల ద్వారా హుస్సేన్‌సాగర్‌లోకి కలుషితనీరు భారీగా చేరింది. వర్షాల కారణంగా కలుషిత జలాలు కొంత పరిమాణం దిగువకు వెళ్లింది. శని,ఆదివారాల్లో నాలాల ద్వారా ప్రమాదకర రసాయనాలు సాగర్‌లోకి చేరుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news