BREAKING : సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంపై మోడీ దిగ్భ్రాంతి..రూ. 2 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటన

-

సికింద్రాబాద్‌లో ఇవాళ ఉదయమే భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జిలో దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న పర్యాటకులు మృతి చెందారు. ఈ సంఘటనలో 8 మంది సజీవదహనం అయ్యారు.

ప్రధాని మోడీ
ప్రధాని మోడీ

అయితే.. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఈ ప్రమాదం చాలా విచారకమన్నారు. ఇక ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోడీ. అలాగే.. క్షత గాత్రులకు రూ.50 వేలు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ట్వీట్‌ చేశారు ప్రధాని మోడీ.

ఇక రూబీ లాడ్జి అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. అపోలో, యశోద, గాంధీలో క్షతగాత్రులకు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ప్రమాద సమయంలో మొత్తం 30 మంది తో పాటు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన గోపాలపురం పోలీసులు… లాడ్జీ ఓనర్ రంజిస్ సింగ్ బగ్గా ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news