ఈటల 30 వేల మెజార్టీతో గెలవబోతున్నాడు.. కాంగ్రెస్‌ మద్దతే కారణం : కోమటి రెడ్డి

-

హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, భువన గిరి పార్లమెంట్‌ సభ్యులు కోమటి రెడ్డి వెంకట రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ 30 వేల మెజార్టీ తో గెలవబోతున్నాడని జోష్యం చెప్పారు కోమటి రెడ్డి వెంకట రెడ్డి.

హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ 5 వేల కోట్లు ఖర్చు చేసిందని.. హుజురాబాద్ ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ కి చెంప పెట్టని మండి పడ్డారు. హుజురాబాద్ ప్రజలు అదిరిపోయే తీర్పు ఇవ్వబోతున్నారని… శత్రువు కు శత్రువు మిత్రుడన్నట్టు ఈటెలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వక తప్పలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.. తాజా గా కోమటి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీ లో పెద్ద దూమారం రేపుతున్నాయి. కాగా.. హుజురాబాద్‌ నియోజక వర్గ ఫలితాల్లో బీజేపీ పార్టీ దూసుకుపోతుంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి… ఈటల రాజేందర్‌… 3 వేలకు పైగా ఓట్ల మెజారిటీని సంపాదించారు.

Read more RELATED
Recommended to you

Latest news