లెఫ్ట్ నుంచి రైట్ లో చేరినప్పుడే ఈటెల ఆత్మగౌరవం మట్టిలో కలిసింది- మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

హుజూరాబాద్ ప్రచారం ముగిసే చివరి రోజు కూడా టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్, ఈటెల రాజేందర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈటెల రాజేందర్ తన స్వలాభం కోసమే బీజేపీలో చేరారని దుయ్యబట్టారు. ఆత్మ గౌరవం గురించి మాట్లాడుతున్న ఈటెల లెఫ్ట్ నుంచి రైట్ పార్టీలో చేరినప్పుడే మట్టిలో కలిసిందన్నారు. టీఆర్ఎస్ పదవులు అనుభవించినప్పుడు ఈటెలకు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా..? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. మంత్రిగా ఉండి ఈటెల హుజూరాబాద్ అభివ్రుద్ధిని పట్టించుకోలదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చలేదని విమర్శించారు. బీసీ నుంచి ఎవరైనా ఎదిగితే ఓర్వలేని వ్యక్తి ఈటెల రాజేందర్ అని, బీసీల అభివ్రుద్ధికి ఈటెల చేసిందేం లేదని ఆయన అన్నారు. రైతుబంధు, ఆసరా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో పచ్చని పంటలు పండుతున్నాయంటే, సాగు నీరు అందుతుందంటే అందుకు కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. హుజూారాబాద్ ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news