హుజూరాబాద్ బైపోల్ దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల నుంచే కాకుండా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 8 వరకే నామినేషన్ల గడువు ముగిసింది. దాదాపు 61 మంది 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ముందు జాగ్రత్తగా కొంతమంది రెండు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల స్క్రూటినీ 11 తారీఖు కావడంతో అధికారులు ప్రతీ నామినేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు వచ్చిన నామినేషన్లను మాత్రమే గుర్తించారు. సక్రమంగా లేని నామినేషన్లను రిజెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం అధికారులు 61 నామినేషన్లలో 18 నామినేషన్లను రిజెక్ట్ చేశారు. దీంతో హుజూరాబాద్ బైపోల్ బరిలో 43 మంది ఉన్నారు. ఈనెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈసమయంలోగా ఎంత మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారో అదే రోజు తెలియనుంది. హుజూరాబాద్ ఉపపోరులో చివరకు ఎంతమంది నిలబడతారో 13 తారీఖు సాయంత్రానికి స్పష్టత రానుంది.
హుజూరాబాద్ బైపోల్ : 18 మంది నామినేషన్ల తిరస్కరణ
By Advik
-
Read more RELATEDRecommended to you
కేసీఆర్ నియమించిన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి : పొన్నం ప్రభాకర్
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు...
Ganesh -
ముస్లిం రిజర్వేషన్లు బరాబర్ ఎత్తేస్తాం.. కిషన్ రెడ్డి సంచలన ప్రకటన..!
ముస్లిం రిజర్వేషన్ల ఎత్తివేతపై కేంద్రమంత్రి, టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి...
Anji N -
ముగిసిన రెండో దశ లోక్ సభ ఎన్నికలు
లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 26న శుక్రవారం...
Anji N -