ఈనెల 8న ఈటెల రాజేందర్ నామినేషన్

-

హుజూరాబాద్ లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. నోటిఫికేషన్ మొదలైన రోజు నుంచే నామినేషన్లు పర్వం మొదలైంది. ప్రధాన పార్టీల నుంచి మొదటి రోజు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలుచేశారు. మిగతా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు. తాజాగా బీజేపీ నామినేషన్ వేసే తేదీని ఖరారు చేసింది. ఈనెల 8న హుజూరాబాద్ బైపోల్ కు బీజేపీ తరుపున ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారని బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ తెలిపారు. నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రానున్నట్లు వెల్లడించారు. నామినేషన్ల అనంతరం హుజూరాబాద్ రాజకీయం మరింత వేడెక్కనుంది. ఈనెల 30న పోలింగ్ ఉండటం ప్రచారానికి సమయం పరిమితంగా ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉరకలెత్తించనున్నారు. ప్రచారం కోసం ప్రధాన పార్టీలు తమ స్టార్ క్యాంపెనర్లను బరిలోకి దింపనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news