Hyderabad : మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్…

-

మరి కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది.మల్కాజ్‌గిరి మరియు అదిలాబాద్ లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.మల్కాజ్‌గిరి లోక్ సభ అభ్యర్థిగా రాగిడి లక్ష్మా రెడ్డి, అదిలాబాద్ లోక్ సభ అభ్యర్థిగా ఆత్రం సక్కును కేసీఆర్ ప్రకటించారు.

కాగా, ఇది వరకే కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బి.వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి కొప్పుల ఈశ్వర్ ,ఖమ్మం పార్లమెంట్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయిన మాలోతు కవిత,మహబూబ్నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి ,చేవెళ్ల పార్లమెంటు స్థానానికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్,వరంగల్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news