రంగంలోకి ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌ : సీవీ ఆనంద్‌

-

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వివిధ రాష్ట్రల ముఖ్యమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రులు హాజరయ్యేందుకు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే ప్రధాని మోడీ కూడా ఈ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. 3వ తేదీ రాత్రికి ప్రధాని మోదీ రాజ్ భవన్ లో బస చేయనున్నట్లు తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభ తర్వాత రాజ్ భవన్ లో ప్రధాని బస చేస్తారన్నారు. అయితే ఆయన బీజేపీ నేతలతో కలసి పరేడ్ గ్రౌండ్స్ లో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని బస సందర్భంగా రాజ్ భవన్ లో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు ఆనంద్‌ . హెచ్ఐసీసీ, బేగంపేట, రాజ్ భవన్ మార్గాల్లో 4వేల మంది పోలీసులు పహారాలో ఉంటారన్న ఆనంద్‌..జడ్, జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉన్న నాయకులు వస్తోన్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

Hyderabad: New city CP vows sound law & order

ప్రధాని మోదీ సహా.. ‌‌కేంద్రమంత్రులు సభకు హాజరవుతారని, పరేడ్ గ్రౌండ్స్ లో లక్షమంది వరకు కూర్చునే అవకాశం ఉంటోందన్నారు. సభకు ప్రధాని మోదీ సహా.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉందని, కంటోన్మెంట్, జీహెచ్ఎంసీ అధికారులు పార్కింగ్ స్థలాలు కేటాయించారన్నారు. ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఇతర జిల్లాల నుంచి అధికారులను పిలిపించామని, పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3వేల మందితో పహారా సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులు బందోబస్త్ లో ఉంటారని, డీఐజీ, ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను సెక్టర్ ఇంఛార్జ్ లుగా నియమించామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news