కేకులతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన హైదరాబాద్ మహిళ..!

-

కేకులు తయారుచేయడంలో కూడా స్పెషలిస్టులు ఉంటారు..వారినే కేక్ ఆర్టిస్ట్ అంటారు. రకరకాల ఆకృతుల్లో కేకులు తయారుచేస్తూ..తమదైన శైలిలో ముందుకెళ్తున్నారు..కానీ ఈ ట్రెండ్ ఇప్పుడు మొదలైంది..పదిహేనేళ్ల క్రితమే.. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అశ్విని ఈ కేకుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అరుదైన కేక్ ఆర్టిస్టుల్లో ఒకరిగా ఆమె గుర్తింపు సాధించింది. ఈమె స్టోరీ ఎంతో మందికి..ఆదర్శం..ఒక అకాడమనీని స్థాపించి..వేలమందికి శిక్షణ అందిస్తుంది. ఇంక ఈమె హైదరాబాదీ అవ్వటం విశేషం. ఆమె ప్రయాణంపై ఓ లుక్కేయండి..!
చిన్నప్పటి నుంచీ సృజనాత్మకత, ఆర్ట్స్‌ ఉన్నవి అంటే.. తనకు ఇష్టమట. బొమ్మలు గీయడం, పెయింటింగ్‌, క్రాఫ్ట్స్‌, అల్లికలు.. ఇలా ప్రతిదీ నేర్చుకుంది… మంచి విద్యార్థినిని. ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ చదివి. ఇన్ఫోసిస్‌లో ఏడున్నరేళ్లు పనిచేశారట… ఓ సారి పనిలో భాగంగా అమెరికా వెళ్లి.. ఖాళీ సమయాల్లో అక్కడి ఆర్ట్‌, క్రాఫ్ట్‌ సంస్థలకు వెళ్తూ… నచ్చిన వాటిల్లో కోర్సులు చేయటం తనకు ఇష్టమట. కేక్‌ క్రాఫ్ట్‌ చూసి కొత్తగా అనిపించిందట. ఆసక్తి కలిగి షార్ట్‌టర్మ్‌ కోర్సులో చేరి.. బాగా నచ్చి మాస్టర్‌ కోర్సుతోపాటు ఎంతోమంది నిపుణుల దగ్గర నైపుణ్యాలూ నేర్చుకుంది.. న్యూయార్క్‌ కలినరీ ఎడ్యుకేషన్‌ నుంచి బేకింగ్‌లో పట్టానీ పొందింది.
అక్కడున్నప్పుడే కేక్‌ తయారీ పోటీల్లో పాల్గొని గెలవటంతో..అక్కడితే తనకు ఆత్మవిశ్వాసం పెరిగందట. బాగా నచ్చిన పని, పైగా నైపుణ్యముంది. సొంతంగా ఏదైనా చేస్తే బాగుంటుందని తనకు అప్పుడే అనిపించిందట.. ఇంట్లో వాళ్లతో చెబితే ‘నీకు నచ్చిందే చెయ్యి’ అన్నారు. ఉద్యోగం మానేసింది… పెళ్లయ్యాక పుణె వెళ్లిందట. అక్కడే 2006లో ‘డ్రీమ్‌ కేక్స్‌’ ప్రారంభించింది..ఇదో డిజైనర్‌ కేక్‌ బొతిక్‌. చక్కెరతో సందర్భాన్ని బట్టి వివిధ రూపాలతోపాటు నిజమైన పూలలా రూపొందించి కేక్‌ను అలంకరించేది..
తన పనితనం చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. కోరినవారికి నేర్పేదట.. తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చింది… ఇక్కడా ఎంతోమంది ఆడవాళ్లు నేర్చుకోవాలనే ఆసక్తి ఉండి, అవకాశం లేక ఆగిపోవడం చూశి.. అప్పుడే వాళ్లకోసం అకాడమీ ప్రారంభించాలనుకుని… ఇంటర్నేషనల్‌ కేక్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ సొసైటీ గుర్తింపునీ పొంది… 2012లో ఆన్‌లైన్‌లో ‘డ్రీమ్‌ కేక్స్‌ అకాడమీ’ని ప్రారంభించి.. దేశంలోనే మొదటి ఆన్‌లైన్‌ కేక్‌ అకాడమీగా పేరుగాంచిది.
తర్వాత ఆఫ్‌లైన్‌లోనూ కొనసాగించింది.. కొవిడ్‌ కారణంగా ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. తను భారత్‌లో ప్రారంభించే నాటికి ‘కేక్‌ ఆర్టిస్ట్‌’ అన్న పదమే పరిచయం లేదు. కేకుల్లో రకాలూ తెలిసేవి కాదు. కొందరు కొత్తగా ప్రయత్నిద్దామనుకున్నా తగిన సమయం ఇచ్చేవాళ్లు కాదు. తయారీకి కావాల్సిన వాటికీ విదేశాలపైనే ఆధారపడాల్సి వచ్చేది. దీనికి తోడు పిల్లలు. సమన్వయం చేసుకోవడం కొంత కష్టమయ్యేది. ఆన్‌లైన్‌ తరగతులపైనా అవగాహన తక్కువే. అనుభవం, సహనంతోనే ఒక్కో అడుగూ వేసుకుంటూ వచ్చినట్లు ఆమె తెలిపింది.
ఇప్పుడు ప్రత్యామ్నాయాలుగా వేటిని వాడొచ్చో తెలుసు. ఈ ప్రయాణంలో మర్చిపోలేని అనుభూతులూ ఎన్నో ఉన్నట్లు తెలిపింది. యూకే కేక్‌ మాస్టర్స్‌ మ్యాగజైన్‌ ఎంపిక చేసిన 10మంది ఉత్తమ కేక్‌ ఆర్టిస్ట్‌ల్లో ఒకరిగా వరుస రెండేళ్లు (2017, 2018) నిలవటం విశేషం.. చక్కెరతో నిజమైన పూలను తలపించేలా చేయడంలో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది.. కేక్‌ మాస్టర్స్‌ మ్యాగజైన్‌.. కేక్‌ ఆస్కార్‌గా పిలిచే దీనిలో రెండుసార్లు చివరి దశవరకూ వెళ్లింది.. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ టీవీ పోటీల్లో న్యాయనిర్ణేతగానూ పాల్గొనింది.. ఎన్నో అంతర్జాతీయ వేదికలపై తన కళను ప్రదర్శించింది. దాదాపు పదివేలమందికి శిక్షణనిచ్చింది.. ఎంతోమంది శిక్షణ పొంది.. సొంత వ్యాపారాలు ప్రారంభించడమే కాదు.. తనలా నేర్పిస్తున్నారు కూడా.
తన ప్రతి నిర్ణయంలో కుటుంబం తోడు నిలిచింది. తమ పిల్లలూ ప్రిన్సెస్‌ బేక్స్‌ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్నారు. నిరంతరం నేర్చుకోవడాన్ని నమ్ముతూ అశ్వినీ ఈ స్థాయికి ఎదిగారు.

Read more RELATED
Recommended to you

Latest news