HYDERBAD : 32 ఏళ్ల వివాహిత‌తో 22ఏళ్ల‌ యువ‌కుడి ప్రేమాయ‌ణం…చివ‌రికి..!

-

పెళ్లైన వివాహిత‌తో యువ‌కుడు ప్రేమాయ‌ణం మొద‌లుపెట్టాడు. అయితే ఇద్ద‌రి మ‌ధ్యేం జ‌రిగిందో ఏమో గానీ చివ‌రికి ఇద్ద‌రూ ఆత్మహ‌త్యా య‌త్నం చేశారు. చివ‌రికి ఆస్ప‌త్రిలో చావుబ్ర‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే….వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి నీలగిరి తోటలో ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. నీల‌గిరి తోట వైపు వెళ్లిన‌ స్థానికులు వారిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఆ ఇద్ద‌రినీ హైదరాబాద్ బోరబండ కు చెందిన‌ దేవి వివాహిత (32), వెంకట్ (22) గా గుర్తించారు. అనంత‌రం వెంట‌నే వికారాబాద్ మిషన్ ఆసుపత్రికి త‌రలించారు. ప్ర‌స్తుతం వివాహిత‌తో పాటూ యువ‌కుడి ప‌రిస్థితి కూడా విష‌మం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రూ గ‌త కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు మాత్రం ఇంకా తెలియ‌లేదు. ఈ ఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news