మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువుకాటకాలు తప్పవు – బొత్స

-

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిన్న కర్నూలు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే, లేదంటే ఇదే నాకు చివరి ఎన్నిక అని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో తనని అవమానించారని.. తన భార్యని కూడా అవమానించారని, ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని మండిపడ్డారు. ఈ కౌరవ సభను గౌరవ సభ చేస్తానని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రాకూడదని అన్నారు. ఆయనకు ఇవే చివరి ఎన్నికలని పేర్కొన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే కరువు కాటకాలు తప్పవన్నారు. ప్రజలు మూడుసార్లు అవకాశం ఇస్తే మోసం చేశాడని అన్నారు. అసెంబ్లీలో ఆయన భార్యని ఎవరూ కించపరచలేదని అన్నారు. సానుభూతి కోసమే చంద్రబాబు డ్రామాలు చేస్తున్నాడని.. ఆయన కోరుకున్నట్లుగానే ప్రజలు తీర్పు ఇస్తారని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news