వైసీపీ నేతలు ఫ్యాన్ ని నమ్ముకుంటే లాభం లేదని కత్తిని నమ్ముకున్నారు – నారా లోకేష్

-

కాకినాడ జిల్లా తుని లో నేడు ఉదయం టిడిపి నేత, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావు పై హత్యాయత్నం జరిగింది. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఓ వ్యక్తికి శేషగిరిరావు బిక్ష వేస్తుండగా అతను హఠాత్తుగా కొడవలితో ఆయనపై విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయాడు. ఈ దాడిలో శేషగిరిరావు చేతికి, తలకి గాయాలయ్యాయి.

కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తుని పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ఈ ఘటనపై స్పందించారు టిడిపి జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్. వైసిపి నేతలు ఫ్యాన్ ని నమ్ముకుంటే లాభం లేదని.. కత్తిని నమ్ముకుంటున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

” ఫ్యాన్ ను నమ్ముకుంటే లాభం లేదని కత్తిని నమ్ముకుంటున్నారు వైసీపీ నేతలు. సొంత బాబాయ్ ని లేపేసిన జగన్ రెడ్డికి ఏమాత్రం తగ్గకుండా అరాచకాలకు పాల్పడుతున్నారు. తునీలో టిడిపి నేత పోల్నాటి శేషగిరిరావు పై వైసీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మంత్రి దాడిశెట్టి రాజా అవినీతి, అక్రమాలపై పోరాడినందుకే శేషగిరిరావుని హత్య చేయాలని కుట్రపన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి. దాడికి పాల్పడిన రౌడీ మూకలతో పాటు వెనక ఉన్న సైకోలని కూడా కఠినంగా శిక్షించాలి ” అని డిమాండ్ చేశారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news