సీఎం జగన్ మాట ఇస్తే మడమ తిప్పరు – మంత్రి ఆదిమూలపు

-

వెలిగొండ ప్రాజెక్ట్ తీగలేరు-5 (చిన్న కండలేరు) కాలువ పనులకు 83.78 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ జి ఓ జారీ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. జి. ఓ ఆర్టీ నెం.1824 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ కృషికి పుల్లలచెరువు మండల ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. తీగలేరు ప్రాజెక్టు పుల్లల చెరువు మండల ప్రజల చిరకాల వాంఛ అని అన్నారు.

గత పాలకులు ఇస్తాం.. తెస్తాం అని మాటలు చెప్పారని కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడు మాట ఇచ్చారని అన్నారు. ఇప్పుడు ఆ మాటను చేసి చూపారని కొనియాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మడమ తిప్పని నైజం అని ప్రజలకు తెలుసని అన్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని 11,500 ఎకరాల రైతుల జీవితాల్లో వెలుగు నింపిందని.. రైతుల తలరాతను మార్చే తీగలేరు-5 నిధుల మంజూరు చేసిన ముఖ్యమంత్రి ఋణం తీర్చుకోలేనేదని అన్నారు మంత్రి ఆదిమూలపు.

వైసీపీ రైతుల పక్షపాతి అనటానికి ఇదో నిదర్శనమన్నారు. రేపు ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండల వ్యాప్తంగా దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పాలాభిషేకం చేసెందుకు రైతులు సిద్ధమవుతున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news