జగనన్న చెబితే సూర్యుని వరకు వెళ్లే దాన్ని.. కన్నీళ్లు పెట్టుకున్న షర్మిల

-

జగనన్న చెబితే సూర్యుని వరకు వెళ్లేదాన్ని.. నేనేం తక్కువ చేశా.. నేనేం తప్పు చేశా..? ఒక్కటైనా చెప్పండి ఇన్ని చేసిన నాకు జగన్ ఒక్క మేలు అయినా చేశారా..? అంటూ వై.ఎస్. షర్మిల కంటతడి పెట్టారు. తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం తనను బాధించిందని తెలిపారు. ఆయన కాస్త ఆలోచించి మాట్లాడాల్సిందన్నారు. కన్న తల్లి, చెల్లిని కోర్టుకు లాగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా..? అని ప్రశ్నించారు.

జగన్ కోసం నేను, అమ్మ చాలా కష్ట పడ్డామని తెలిపారు. దాదాపు 3,200 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేసామని తెలిపారు. ఆస్తులపై అందరికీ సమాన వాటా ఉండాలని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నిర్ణయించారు. అందుకే వాటాలపై జగన్ ను నిలదీస్తున్నానని తెలిపారు  షర్మిల. జగన్ మోహన్ రెడ్డి జన్మంతటికి తన చెల్లులు కోసం ఇది చేశానని చెప్పుకోగలరా..? “నాకు, నా బిడ్డలకు అన్యాయం జగన్  చేస్తున్నారన్నది పచ్చి నిజం. ఇది దేవుడికి తెలుసు. అమ్మ, నాన్నతో పాటు చాలా మందికి తెలుసన్నారు. జగన్ ని వైసీపీ క్యాడర్ ఎత్తి పట్టుకుంది” అంటూ కన్నీళ్లతో బాధను వ్యక్తం చేశారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news