అనంతరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..!

-

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ప్రమాదం జరుగకుండా జాగ్రత్తలు పడాలని అధికారులు ఎన్నిమార్లు సూచించినప్పటికీ వాటిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తాజాగా అనంతపురం జిల్లాలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్పల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద లారీని కారు ఢీకొట్టింది. టైరు పగిలి అదుపు తప్పిన కారు లారీ కిందకు దూసుకెళ్లింది. దీంతో కారు  నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు.

అనంతపురం- కడప జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తాడిపత్రిలో నగర కీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా అనంతపురం ఇస్కాన్ టెంపుల్ కి చెందిన భక్తులుగా గుర్తించారు. శ్రీధర్ (28),  సంతోష్ (26),వెంకన్న (35),  ప్రసన్న (34),  వెంకీ (24), షణ్ముఖ (30) మరణించిన వారిలో ఉన్నారు. వీరి

Read more RELATED
Recommended to you

Latest news