భూ సమస్యలు పరిష్కారం కాకపోతే తుపాకులు చేతబడతాం: సిపిఐ నారాయణ

-

భూ సమస్యలు పరిష్కారం కాకపోతే తుపాకులు చేతపడతామని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల బాగోగులు చూడడం చేతకాక సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోతున్నారని అన్నారు. కెసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే వరంగల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ల్యాండ్ మాఫియాతో చేతులు కలుగుతోందన్నారు.

ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు సహకరిస్తే తమతో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. సోమవారం ఉదయం బాలసముద్రం ఏకశిలా పార్కు వద్ద సిపిఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని న్యాయబద్ధంగా పోరాడుతున్నామన్నారు.

ఆత్మగౌరవం కోసం సీపిఐ పోరాడుతుందన్నారు.” ప్రభుత్వంతో చావో, రేవో తేల్చుకుంటాం. ఉంటే గుడిసెలో ఉంటాం లేకుంటే జైల్లో ఉంటాం.” అని స్పష్టం చేశారు నారాయణ. పోలీసులను అడ్డుపెట్టి పేదలపై దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వరంగల్ పోరుగడ్డ, భూపోరాటానికి ఇక్కడే నాంది పలుకుతామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news