నిన్ను ఎవడో రాయితో చీకట్లో కొడితే నన్ను అంటావా ? : చంద్రబాబు

-

నిన్న విజయవాడలో సీఎం జగన్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు జగన్ పై రాయితో దాడి చేశారు.ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కన్నుకి గాయం అయింది. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ… సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.విశాఖ జిల్లా గాజువాక సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రభుత్వం నీది.. ముఖ్యమంత్రి నువ్వు.. నీ ప్రభుత్వంలో కరెంటు పోతే, నిన్ను ఎవడో చీకట్లో కొడితే నన్ను అంటావా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కోడికత్తి డ్రామా ఆడావు, బాబాయ్ గొడ్డలి వేటు డ్రామా ఆడావు. నా మీద తోశావ్ అని మండిపడ్డారు.నాకు నేరాలు అంటగడతావా ? నేను నీలాగా నేరస్తులని ప్రోత్సహించను. నేరాలు చేసే వాళ్లని తొక్కుతా అని వార్నింగ్ ఇచ్చారు .

Read more RELATED
Recommended to you

Latest news