ఆ దిశలో బాత్రూమ్‌ ఉంటే అప్పుల భారం ఎక్కువ అవుతుందట..!

-

ప్రపంచాన్ని నడిపేది డబ్బు.. ఇద్దరిని వీడదీయగల సత్తా డబ్బుకే ఉంది.. రెండు కుటుంబాలను కలిపే పవర్ కూడా మనీకే ఉంది. అలాంటిది.. ఎ‌వరూ కూడా బికారు అవ్వాలని, అప్పులు పెరగాలని అనుకోరు. అయితే మనం తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల ఆర్థిక కష్టాలు వస్తాయి. వాస్తు అనేది మనిషి జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. మనం ఎంత సంపాదించినా వాస్తు కరెక్టుగా లేదంటే.. అప్పుల బాధను ఎదుర్కోక తప్పదు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చిన్న చిన్న పనులు సరిచేస్తే అప్పుల బాధ తగ్గుతుంది. ఇల్లు లేదా దుకాణంలో లక్ష్మీదేవి, కుబేరుడి విగ్రహం ఉత్తర దిశలో ప్రతిష్టించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. తల్లి లక్ష్మి, ఉత్తరాది నుంచి వచ్చిన కుబేరుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుందట. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దిక్కున లక్ష్మీదేవి, కుబేరుడి విగ్రహాలను ప్రతిష్టించి నిత్యం పూజించడం వల్ల అప్పుల బాధ తొలగిపోతుంది. కొన్ని ఇళ్లలో భోజనం చేసిన తర్వాత పాత్రలను అలాగే వదిలేస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇలా చేయడం వల్ల ఇంట్లో దరిద్య్రం వెంటాడుతుందట. అలాగే ఇంట్లో ధన నష్టం కూడా జరుగుతుంది. డబ్బు ఉన్నా కూడా అదృష్టం వరించదు.

వాస్తు శాస్త్రం ప్రకారం.. అద్దం ఎల్లప్పుడూ ఇల్లు, దుకాణంలో తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో అప్పుల భారం పెరగదు. వాస్తు శాస్త్రం ప్రకారం.. మీరు రుణం తీసుకున్నట్లయితే లేదా దాని మొదటి వాయిదా మంగళవారం చెల్లించాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా అప్పుల బాధ నుంచి విముక్తులవుతారు.

ఇల్లు లేదా కార్యాలయంలో బాత్రూమ్ ఎప్పుడూ.. నైరుతి దిశలో ఉండకూడదు. ఈ దిశలో బాత్రూమ్ ఉండటం వల్ల అప్పుల పాలవుతారట. ఒకవేళ తప్పుదంటే ఆ మూలలో ఉప్పుతో నిండిన గిన్నెను ఉంచాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయట.

ఈ చిన్న చిన్న వాస్తు టిప్స్.. పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news