కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలప‌డం ఖాయం : విజయశాంతి

-

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలప‌డం ఖాయమని విజయశాంతి హెచ్చరించారు. కేసీఆర్‌కు ఓడిపోతాన‌నే భ‌యం ప‌ట్టుకుందని… అందుకే బీజేపీ కార్య‌కర్త‌ల‌పై దాడులు, నాయ‌కుల‌పై త‌ప్పుడు కేసులు పెడుతూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తుండని ఆగ్రహించారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు సంబంధించి ప్రతిరోజూ పూర్తి స్థాయిలో రిపోర్టు ఇవ్వాలని అటు ఇంటెలిజెన్స్​కు, ఇటు డిపార్ట్​మెంట్లకు కేసీఆర్ సర్కార్ నుంచి ఇంటర్నల్ ఆదేశాలు వెళ్లాయని ఆరోపించారు.

ఆ ధర్నాల వెనక పొలిటికల్ అజెండా ఏమైనా ఉందా? ఏ లీడర్లు పాల్గొన్నారు? సమస్య ఏంటి? అనే వివరాలను పంపాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు చూస్తే కేసీఆర్ మ‌ళ్లీ అధికారంలోకి రాడని తేలిపోయిందన్నారు. అందుకే అధికారుల‌ను ఉప‌యోగించుకుని అధికారం నిల‌బెట్టుకోవాల‌ని చూస్తుండని మండి పడ్డారు.

కాగా, మూడ్రోజుల కిందట మండల స్థాయి నుంచి డేటా తెప్పించగా… ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో పొలిటికల్ మీటింగ్స్, ఆందోళనలు, నిరసనలన్నీ కలిపి 180 జరిగినట్లు రిపోర్టులో పేర్కొన్నారని తెలిపారు విజయశాంతి. ఏయే విషయాలపై మండల స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే దానిపై ప్రతిరోజూ సీఎంఓకు రిపోర్టు వెళ్తున్నది. అందులో ఉన్న అంశాల ప్రకారం… పొలిటికల్ మీటింగ్​ అయితే ఎంతమంది వస్తున్నారు? అపోజిషన్ పార్టీ వాళ్లా? మండల, జిల్లా స్థాయిలో ఏ లీడర్ ఎంత మేరకు ప్రభావం చేయగలుగుతారు?… అనే వివరాలను కూడా పంపాలని ఆదేశించారని విమర్శించారు. కేసీఆర్… నువ్వెన్ని రిపోర్టులు తెచ్చుకున్నా… ఎన్ని జిమ్మిక్కులు చేసినా… నీ ప్ర‌భుత్వాన్ని తెలంగాణ ప్ర‌జానీకం బంగాళాఖాతంలో కలప‌డం ఖాయమని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news