దమ్మాయిగూడలో ప్రభుత్వం డంపింగ్ యార్డ్ తరలించకుంటే మేము తరలించి చూపిస్తాం – బండి సంజయ్

-

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని దమ్మయిగుడ లోతెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 7వ రోజు కొనసాగుతోంది. పాదయాత్రలో దారి వెంట ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు బండి సంజయ్. అడుగడుగునా తమ సమస్యలను బండి సంజయ్ కి మొరపెట్టుకున్నారు జవహర్ నగర్, దమ్మాయిగూడా ప్రజలు. దమ్మాయిగూడా చౌరస్తా లో బండి సంజయ్ మాట్లాడుతూ, ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ను తరలించి తీరుతామని అన్నారు.

 

మంత్రి కేటీఆర్ కి, సీఎం కేసీఆర్ కు ఇక్కడి ప్రజల మీద చిత్తశుద్ది ఉంటే డంపిండ్ యార్డ్ తరలించాలని.. ప్రభుత్వం తరలించకుంటే, మేమే తరలించి చూపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అంతేకాక ముఖ్య మంత్రి, కేసీఆర్ ను, ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ ప్రసంగాన్ని ముగించారు.

Read more RELATED
Recommended to you

Latest news