రామతీర్థం లో రాములవారి విగ్రహం నరికేస్తే దానికి బాధ లేదా జగన్ ? : పవన్ కళ్యాణ్

-

నెల్లిమర్ల వారాహి విజయభేరి బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…చిన్న గులకరాయి పెట్టుకుని, పెద్ద ప్లాస్టర్ వేయించుకున్నాడు జగన్. ఎక్సిబిషన్ చేస్తూ ఉన్నాడు అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రామతీర్థం లో రాములవారి విగ్రహం నరికేస్తే దానికి బాధ లేదు,బాబాయిపై గొడ్డలి వేటు గాయం కాదు కాని గులకాయి దెబ్బే గాయయా? అని పవన్ ప్రశ్నించారు.లా & ఆర్డర్ బలంగా చూసుకునే ప్రభుత్వాలు రావాలి.

తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో ఏనాడు దేవాలయాలపై ఇలాంటి దాడులు, దుర్ఘటనలు జరగలేదు అని పేర్కొన్నారు.సొంత చెల్లె అంటుంది. కొట్టుకున్నదో కొట్టించుకున్నదో తెలీదు కానీ నీ మీద చిన్న రాయి పడితే రాష్ట్రమంతా సమస్యా, గొడ్డలి వేటు పడితే సమస్య లేదా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.నెల్లిమర్ల నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధులు పెరిగాయన్నారు. చంపావతి నది నుంచి ఇసుక దోపిడీ పెరిగిందని మండిపడ్డారు. ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే కూటమి అధికారంలోకి రావాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news