అవి నిరూపిస్తే.. ఎన్నికల బరిలోంచి తప్పుకొని కాంగ్రెస్ కి ప్రచారం చేస్తా.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ చేశారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలలో మహిళలకు.. రూ.2500, ఆసరా పెన్షన్, రూ. 4వేలు, విద్యార్థి భరోసా ఇచ్చామని నిరూపించండి అని ఛాలెంజ్ విసిరారు. నిరూపిస్తే.. తాను పార్లమెంట్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. నిరూపిస్తే.. కాంగ్రెస్ తరపున స్వయంగా తానే  ప్రచారం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.

నిరూపించకపోతే మీరు పోటీ నుంచి తప్పుకుంటారా..? అని ప్రశ్నించారు. నా సవాల్ ని స్వీకరించే దమ్ము ఏ కాంగ్రెస్ నాయకుడికి అయినా ఉందా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని అసలు దేశ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కనీసం పీఎం అభ్యర్థి కూడా ఎవ్వడో తెలియదన్నారు. కరీంనగర్ లో తనకు ఎవ్వరూ పోటీ కాదని.. ఆ రెండు పార్టీలు రెండో స్థానం కోసం పోటీ పడబోతున్నాయని జోస్యం చెప్పారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news