రాష్ట్రాన్ని విడగొడతామంటే తోలు తీసి కూర్చోబెడతాం – పవన్ కళ్యాణ్

-

తెలంగాణ విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందోనని.. రాష్ట్రాన్ని విడగొడతామంటే తోలు తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నేతలు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విడదీస్తుంటే ఊరుకుంటామా? అని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలా అంటూ మండిపడ్డారు. రాజ్యాంగం గురించి మీకేం తెలుసు..? అని ప్రశ్నించారు. రాయలసీమ.. రాయలసీమ అంటారు.. అసలు రాయలసీమకి ఏం చేశారు అని మండపడ్డారు.

ముఖ్యమంత్రిలు అందరూ రాయలసీమ వారే కదా..! మరి ఎందుకు రాయలసీమ అభివృద్ధి కాలేదని ప్రశ్నించారు. కర్నూలు నుంచి ఎందుకు వలసలు వెళ్లిపోతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం జగిత్యాల, గుంటూరు వాసులు చనిపోయారని.. ఆ విషయం వైఎస్ఆర్సీపీకి తెలుసా..? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకొకరిని చూడరని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలనడం పై మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news