దమ్ముంటే హరీష్ రావు గౌరవెల్లి భూనిర్వాసితుల దగ్గరికి రావాలి: పొన్నం ప్రభాకర్

-

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి లో గౌరవెల్లి భూనిర్వాసితుల దీక్షా శిబిరాన్ని సందర్శించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సిపిఐ నేతలు. దమ్ముంటే గుడాటిపల్లి భూనిర్వాసితుల దీక్షా శిబిరానికి వచ్చి మాట్లాడాలని మంత్రి హరీష్ రావుకు పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. లేనిపక్షంలో నిర్వాసితులను తీసుకొని హరీశ్ రావు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

వారి నుంచి మంత్రికి ఏం జరగకుండా తమ కార్యకర్తలు రక్షణ కవచంగా ఉంటారని చెప్పారు. మంత్రి ఆదేశాలతోనే నిర్వాసితుల పై లాఠీచార్జి జరిగిందని పొన్నం ఆరోపించారు. దీనికి ఆయనే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల పై లాఠీచార్జి జరగలేదని సిపి చెప్పడం విడ్డూరంగా ఉందని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఐపీఎస్ ఉద్యోగంలో ఉన్న ఆమె విజ్ఞత ఇదేనా అని ప్రశ్నించారు.

టిఆర్ఎస్ నాయకులు నిర్వాసితులను రెచ్చగొట్టేలా వ్యవహరించారు అని మండిపడ్డారు. ఎన్జిటి కేసు, హైకోర్టు స్టే, ఉండగా ట్రైలర్ రన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే నిర్వాసితులను బలిపశువులను చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news