తెలంగాణ ప్రభుత్వానికి ఊరట..ఎన్జీటీ విధించిన రూ.900 కోట్ల జరిమానాపై సుప్రీంకోర్టు స్టే

-

తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన సుప్రీంకోర్టు.. గతంలో ఎన్జీటీ విధించిన రూ.900 కోట్ల జరిమానాపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పాలమూరు-రంగారెడ్డి “తాగునీటి ప్రాజెక్టు” పనులు కొనసాగించేందుకు అనుమతి మంజూరు చేసింది సుప్రీం కోర్టు. జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎమ్.ఎమ్. సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.

పాలమూరు-రంగారెడ్డి తాగునీటి ప్రాజెక్టు కు ఆమోదం తెలిపిన సుప్రీంకోర్టు… గతంలో ఎన్.జి.టి విధించిన 900 కోట్ల రూపాయల జరిమానా పై స్టే విధించింది. “తాగునీటి” ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని 2006 లో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. 2006 వ సంవత్సరం, సెప్టెంబర్ నెలలో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన “పర్యావరణ ప్రభావ అంచనా ప్రకటన” ( Environment Impact Assessment Notification) లో స్పష్టం చేసిన అంశాలను ఆధారం చేసుకుని వాదనలు వినిపించింది తెలంగాణ ప్రభుత్వం. “రిజర్వాయర్ లెవల్” వరకు నిర్మాణ పనులు కొనసాగేందుకు అనుమతులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news