ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు పెళ్లి చేసుకుంటా.. కృతి సనన్

-

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కృతి సనన్.. తెలుగులో మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమా హిట్ అవ్వకపోయినా ఈ అమ్మడుకు మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది.. అలాగే ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకొని మరొకసారి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా ఉంది.

 

ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.. కానీ కొన్ని కారణాలతో ఇంకా విడుదల కాలేదు. అయితే ఈ సినిమా ప్రచారంలో పాల్గొన్న కృతి.. తాజాగా పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది…” నేను మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే చిత్రంలో నటించాను.. నిజంగా మహేష్ బాబు తో నటించడం నా అదృష్టం అని అనుకుంటాను. ఎందుకంటే ఆయన వల్లే నేను తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాను. అలాగే మహేష్ బాబు చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. ఇక నాకు తెలుగు భాషలో మరింత పటుత్వం రావడానికి ప్రధాన కారణం ప్రభాస్. ఎందుకంటే నేను ఆయనతో ఆది పురుష్ సినిమా షూటింగ్ చేసేటప్పుడు నాకు తెలుగు నేర్పించారు. ప్రస్తుతం తెలుగులో ఎవరైనా ఏదైనా మాట్లాడితే నాకు అర్థం అవుతుంది. అలాగే నా పెళ్లి ప్రేమ కోసం చాలామంది ఇప్పటికే ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు.. నాకు కాబోయే భర్త నా అందానికి తగిన వాడై ఉంటే చాలు. నాలాగే అందంగా ఉండడం చాలా ఇంపార్టెంట్..” అంటూ చెప్పుకొచ్చింది.. అయితే ప్రస్తుతం ఈమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే హీరో ప్రభాస్ అవకాశం ఇస్తే అతని పెళ్లి చేసుకుంటానని కృతి సనన్ చెప్పడంతో చెప్పడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు గుప్పుమన్నాయి.. తాజాగా మళ్ళి ఈమె చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఈమె పెళ్లి విషయం చర్చకు దారి తీసింది..

Read more RELATED
Recommended to you

Latest news