KGF-3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి: చంద్రబాబు

-

సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజాగళం భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సహజ వనరులను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమంగా దోచారని ఆరోపించారు .’KGF-1, 2 చూడాలంటే కోలార్ పోవాలి కానీ KGF-3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి. KGF అంటే కాకాని గోవర్ధన్ ఫీల్డ్స్ అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఆయన సృష్టించిన ప్రాంతంలోనే పాతిపెడతా. మైనింగ్ మాఫియాతో కొండలు, గుట్టలు ఏమీ మిగలలేదు అని మండిపడ్డారు. క్వార్ట్జ్ రూ.4500 కోట్ల దోపిడీ జరిగింది’ అని సర్వేపల్లిలో జరిగిన సభలో సిబిఎన్ ఆరోపించారు.కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్‌ని కాకాణి గోవర్థన్‌రెడ్డి తరిమేశారని చంద్రబాబు విరుచుకుపడ్డారు.ఇలాంటి వారు మంత్రులు కాబట్టే ప్రజాస్వామ్యం విలవిలలాడుతోందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version