పెళ్లి చేసుకోలేమోనని ప్రియుడితో కలిపి వివాహిత ఆత్మహత్యాయత్నం..

-

పచ్చని సంసారాల్లో వివాహితేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. ఫలితంగా హత్యలు, ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. చక్కని భర్త, పిల్లలు ఉన్నా కూడా పక్కదారి పడుతున్నారు కొంతమంది వివాహితలు. తాజాగా ఇలాంటి ఘటనే వికారాబాద్ జిల్లాలో జరిగింది. పెళ్లై పిల్లలున్న మహిళ వేరే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పెళ్లి చేసుకోలేమోనని యువకుడితో కలిసి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.

వివరాల్లోకి వెళితే..నగరానికి చెందిన ఓ యువతి(32)కి పెళ్లై పిల్లలు ఉన్నారు. అయితే సదురు వివాహిత వికారాబాద్ జిల్లాకు చెందిన యువకుడి (22)తో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కాగా తమ పెళ్లికి అడ్డంకులు వస్తాయని వివాహిత, ప్రియుడితో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. వికారాబాద్ జిల్లా పూడురు మండలం కండ్లపల్లి అటవీ ప్రాంతంలో ఇద్దరూ పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరిని వికారాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇద్దరు కూడా ఒకే కంపెనీలో పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news