రైతులకు బిగ్ షాక్.. పీఎం కిసాన్‌లో కొత్త రూల్స్‌ అమలు !

-

రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్‌ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలలో పీఎం కిసాన్ యోజన స్కీమ్ ఒకటి. రైతులకు ఏడాదికీ రూ. 6000 చొప్పున అందిస్తోంది. ఈ డబ్బులు రూ.2000 చొప్పున మూడు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది.

ఈ పథకానికి అర్హులైన వారే కాకుండా అనర్హులు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకంలో డబ్బులు పొందిన అనర్హుల నుంచి రికవరీ చేసే పనిలో ఉంది. మీరు అనర్హులుగా ఉండి ఈ పీఎం కిసాన్ పథకాన్ని పొందినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. వారి నుంచి డబ్బులను రికవరీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మార్చింది. దీంతో అనర్హులు కానీ రైతులకు డబ్బులు కట్‌ చేయనుంది కేంద్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news